NAVODAYA SCHOOLS ADMISSIONS – 2021
నవోదయ
విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో
ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
జవహర్ నవో దయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేఎన్వీఎ) 2022′ ద్వారా అడ్మిషన్లు ఇస్తారు.
👉భోజన, వసతి సౌకర్యాలతో
పాటు బోధన ఉచితం. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తారు.
తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం
నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
పిల్లలకు దీని నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
👉పూర్తి వివరాల pdf కొరకు కింద క్లిక్ చేయండి👇
Click Here
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు మాతృభాష/ప్రాంతీయ
భాషలో బోధన ఉంటుంది. తరవాత మేథమెటిక్స్, సైన్స్ సబ్జెక్లను
ఆంగ్ల మాధ్యమంలో, సోషల్ సైన్సను హిందీలో బోధి స్తారు. ఈ
విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థు లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ
ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది.
విద్యాలయాలు – సీట్లు:
దేశవ్యాప్తంగా మొత్తం 661 జేఎన్వలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో
13 విద్యాలయాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ
వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు మరో రెండు విద్యాలయాలు కేటాయించారు.
తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో ఆరోత
రగతిలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు అవ కాశం
కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత జేఎ న్వీల్లో గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు ప్రత్యేకించారు
అర్హత:
ప్రస్తుతం ప్రభుత్వ/ ప్రభుత్వ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో అయిదో తరగతి చదువు తున్న విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు. ఎప్స్ ఓఎస్ నుంచి బీ సర్టిఫికెట్ కాంపిటెన్సీ కోర్సు పూర్తి
చేసినవారు/సెప్టెంబరు 30 నాటికి పూర్తిచేసేవారు కూడా
అర్హులే. విద్యార్థులు 2009 మే 1 నుంచి
2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
టెస్ట్:
దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2
గంటలు. మొత్తం మార్కులు 100. ఈ పరీక్షలో మూడు సెక్షన్లు
ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్లో 40 ప్రశ్నలు అడు గుతారు.
దీనికి 50 మార్కులు కేటాయించారు. అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్టు ఒక్కోదానిలో 20 ప్రశ్నలు ఇస్తారు.
ఒక్కో దానికి 25 మార్కులు ఉంటాయి.
మెంటల్ ఎబిలిటీ టెస్టు గంట;
మిగిలినవాటికి ఒక్కోదానికి అర్థగంట పరీక్ష సమయం ఇస్తారు.
విద్యార్థులు బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ ఓఎంఆర్ పత్రం మీద
సమాధానాలు గుర్తించాలి. తెలుగు ఈ పరీక్షని తెలుగు, హిందీ,
ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ ,
కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
జేఎన్వీ సెలెక్షన్
– ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
జేఎన్వీఎన్జీ 2022 తేదీ: 2022 ఏప్రిల్ 30న